శబరిమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తాయి. ట్రైన్ టైమింగ్స్ తో పాటు రూట్ల వివరాలు తెలుసుకోండి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి త్రివేండ్రంకు, త్రివేండ్రం నుంచి హైదరాబాద్కు స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ రైళ్లు ప్రతీ రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సీటింగ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. రైలు నెంబర్ 07230 మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం సాయంత్రం 6.50 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. 2021 జనవరి 18 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07229 త్రివేండ్రంలో ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ కు చేరుకుంటుంది.
నవంబర్ 30 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 2021 జనవరి 21 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దారిలో చర్లపల్లి, తెనాలి జంక్షన్, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, జోలాప్ పెట్టై, మొరప్పూర్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, ఒట్టపాళెం, షొరనూర్ జంక్షన్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనశెరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కన్యాకులం జంక్షన్, కరునగపల్లి, కొల్లాం జంక్షన్, వర్కలశివగిరి స్టేషన్లలో ఆగుతాయి. ఇప్పటికే ఈ రైళ్ల బుకింగ్ ప్రారంభమైంది. శబరిమల వెళ్లాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ లో https://www.irctc.co.in/ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇదే వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.