జీహెచ్ఎంసీ ఎన్నికలను టిఆర్ఎస్ వాయిదా వేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. డిసెంబర్ 4న మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 12శాతం మైనారిటీ ఓట్ల కోసం 80శాతం ఉన్న హిందువులను టిఆర్ఎస్ కించపరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం రూ. 3,500 కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో కుటుంబపాలన అంతం కావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కావాలని సూచించారు.