తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,69,816కి చేరింది. ఆదివారం రోజు వైరస్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 1,458కి చేరింది. వ్యాధి బారి నుంచి నిన్న 1058 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,58,336కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 119 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 7,946 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.