ఐటీఐఆర్ను రద్దు చేసినోళ్లు ఐటీ హబ్ చేస్తామంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హైదరాబాద్ ది నిజాం సంస్కృతి అని అమిత్ షా అన్నారని.. కానీ 1920లో గంగా జమునా తెహజీబ్ అని బాపూజీనే అన్నారని చెప్పారు. కేసీఆర్ ఒక్కడేననీ.. సింహం సింగిల్గా వస్తుందని ఆయన అన్నారు. బీజేపీకి విషయం లేదు.. నిండా విషమే అని చెప్పారు. అన్ని మతాలు కలసి ఉంటే బీజేపీ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని తెలిపారు. పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్ను పెట్టొద్దని చెప్పారు. కూల గొడుతానన్న ఇద్దరు పిచ్చోళ్లను తరిమి కొట్టండని పిలుపు నిచ్చారు.