వీపనగండ్ల మేజర్ న్యూస్: ప్రభుత్వం తనకు సాగు చేసుకోవటానికి ఇచ్చిన భూమిలో గ్రామానికి చెందిన కొందరు సర్వే చేయించి అక్రమంగా తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారంటూ యువకుడు ఆందోళన చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది, బాధితుడు బక్కి చిన్ని కృష్ణ కథనం ప్రకారం గ్రామానికి సమీపంలోని ప్రభుత్వ భూమి 209 సర్వేనెంబర్ లో తనకు తన తమ్ముడికి మహేష్ కు చెరో మూడు ఎకరాల భూమిని సాగు చేసుకోవటానికి పట్టా ఇవ్వడం జరిగిందని అన్నారు, గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు తన తండ్రి పేరున కూడా 209 సర్వేనెంబర్ లో సాగు చేసుకోవటానికి ప్రభుత్వం భూమి ఇచ్చిందని సర్వే చేసి హద్దులు చూపాలని ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినట్లు తాసిల్దార్ తెలిపారు,డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నిర్మల భాయ్ భూమిని సర్వే చేయడానికి రాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఎలా సర్వే చేస్తారంటూ మనస్తాపం గురై అధికారుల ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు, సమీపంలోని రైతులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని తాసిల్దార్ యేసయ్య పరామర్శించారు,