మహబూబ్ నగర్ మేజర్ న్యూస్ : బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన దివంగత విరసనోళ్ళ నారాయణ గౌడ్ ,ఎక్సైజ్ శాఖ మంత్రి తండ్రి గారి దశదిన ఖర్మ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరయ్యారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని దివంగత వి.నారాయణ గౌడ్ సమాధి పై పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ,వారి తల్లి శాంతా నారాయణ గౌడ్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తు ధైర్యాన్నిచరు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రతిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. కీర్తి శేషులు నారాయణ గౌడ్ దశదినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎంపీలు సంతోష్ కుమార్, పోతుగంటి రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, జనార్దన్ రెడ్డి, శాసన సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు,అంజయ్య యాదవ్,ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరై కీర్తిశేషులు నారాయణ గౌడ్ గారి సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.