జడ్చర్ల పట్టణములో ని తెరాస సభ్యత్వ నమోదు సరళిని గౌరవ శాసనసభ్యులు Dr. సి. లక్ష్మా రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణములోని చంద్రగార్డెన్ సమీపంలో ఏర్పాటుచేసిన తెరాస సభ్యత్వ నమోదు కేంద్రాన్ని (Online entry Centre) సందర్శించారు. Online లో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు పరిశీలించారు. అనంతరం పలువురు తెరాస నాయకులకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వలను ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి చేతులమీదుగా అందజేశారు. అనంతరం కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని, జడ్చర్ల లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి స్వచ్ఛందంగా ప్రజలందరూ సభ్యత్వ నమోదును స్వీకరిస్తున్నారని అన్నారు.