కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించి దొరికిపోయిన ఘట్ కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ఆమె ఆత్మహత్యపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాతే విద్యార్థిని మృతిపై క్లారిటీ రానుంది. విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో వారం రోజులుగా ఆహరం తీసుకోలేదని పోస్టుమార్టంలో తేలింది. పేగులు, లివర్ దెబ్బతినడంతో ఆమె మృతిచెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది.