నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సాగర సంగమం జరుగుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హాలియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు లోపల కలిసి పనిచేస్తూ బయటికి వేరుగా పోటీ చేస్తున్నాయని విమర్శించారు. ఇక సాగర్తో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పూర్తిగా గెలవబోతోందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.