దేవరయంజాల్ భూములు కొల్లగొట్టిన వారిలో అంతా టీఆర్ఎస్ నేతలే ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ను దోషిగా చూపడం కోసం అసైన్డ్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. అసైన్డ్ భూముల అన్యాక్రాంతం అయిన వాటిని అన్ని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ వర్గాలు నిరుపేదలు కావడంతో భూములు నిలబెట్టుకోలేకపోయారని జీవన్రెడ్డి చెప్పారు. 2018లో తీసుకొచ్చిన నూతన పట్టాదారు విధానంతో అసైన్డ్ భూముల మార్పిడి చేశారని జీవన్రెడ్డి తెలిపారు.