కరోనా ఓ వైపు కకావికలం చేస్తుంటే మరో వైపు నుంచి కొత్త ప్రమాదం ముంచుకువస్తోంది. తాజాగా హైదరాబాద్ జూపార్క్ లో సింహాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాదే జంతువుల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయినా.. ఇండియాలో మాత్రం జంతువులకు కరోనా సోకడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే అప్రమత్తంగా లేకపోతే మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకే ప్రమాదం ఉందని లాకోన్స్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మనుషులు ఉన్న చోటల్లా వైరస్ ఉంది. కోవిడ్ వైరస్ ముప్పు వన్యప్రాణుల నుంచి పెంపుడు జంతువుల వరకు అన్నింటికి వైరస్ ముప్పు ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్ తగ్గే వరకు కుక్కలు, పిల్లులతో జాగ్రత్తగా ఉండటం మేలు అని సూచిస్తున్నారు. వాటిలో వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలని చెబుతున్నారు. కాగా దేశ వ్యాప్తంగా వన్యప్రాణులకు సంబంధించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 4 చోట్ల నిర్వహిస్తున్నారు. వాటిలో అత్తాపూర్ లోని లాకోన్స్ ఒకటిగా ఉంది.