హైదరాబాద్: రాజధాని నగరంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. నేరేడ్మెట్లోని అనంతనగర్ కాలనీలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తిని దుండగుడు హత్య చేశాడు. కాలనీకి చెందిన శ్యామ్సుందర్ తన ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దాటినతర్వాత ఓ వ్యక్తి అతని ఇంటి డోర్ కొట్టడంతో శ్యామ్ తలుపు తెరిచాడు. అనంతరం ఆ దుండగుడు శ్యామ్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో అదికాస్త పెద్దదయ్యింది. ఈ క్రమంలో దుండగుడు నిద్రమత్తులో ఉన్న శ్యామ్ తలపై సిమెంట్ ఇటుకతో బలంగా కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో శ్యామ్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.