హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాలపై హైకోర్టు ఆరా తీయనుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రెమ్డిసివర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్పై వైద్య శాఖ, పోలీస్ శాఖ నివేదికను కోర్టుకు అందించనుంది. ఈనెల 14న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని సైతం పోలీసులు సమర్పించనున్నారు. మూడు కమిషనరేట్స్ పరిధిలోని వీడియో గ్రఫీని కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. నేడు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది.