ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లె, పట్టణ ప్రగతి అంశంపై కేసీఆర్ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 13, 2021, 12:28 PM

ప్రగతి భవన్‎లో పల్లె, పట్టణ ప్రగతి అంశంపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై గులాబీ బాస్ సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ సమీక్షలో పాల్గొన్నారు. పల్లె ప్రగతి సమీక్ష అనంతరం హుజురాబాద్ ఉపఎన్నికపై కరీంనగర్, వరంగల్ నేతలతో సీఎం చర్చించనున్నట్లుతెలుస్తుంది.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com