రంగారెడ్డి జిల్లాలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మద్యం తాగి చిందులు వేస్తున్న యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో మద్యం తాగి యువతీ యువకులు చిందులు వేస్తున్న 50 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.