ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 26, 2021, 04:16 PM

తెలంగాణలోని దళితులకు ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌ మిల్లులు, వైన్‌ షాపులు.. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వివిధ ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాల్లో లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి.. దళితబంధు పథకం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వ లబ్ధిదారుల భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రక్షణ నిధి కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారులతో కమిటీ నిర్వహించబడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి ఏటా కనీసం డబ్బును జమ చేస్తూ దళిత రక్షణ నిధిని కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఆర్థికంగా పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా రక్షణనిధిని వినియోగించనున్నట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com