ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్లు, వైన్స్‌లలో సైదాబాద్ హత్యాచార నిందితుడి ఫొటో! : ఎక్సైజ్ శాఖ కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 15, 2021, 05:31 PM

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడి ఫొటోను బార్లు, వైన్స్‌లలో పెట్టాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. చిన్నారి హత్యాచారంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అన్ని జిల్లా పోలీస్ బాస్‌లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com