గచ్చిబౌలిలో మంగళవారం జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒకరు మృతి చెందారు.బేగంపేటలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆకాశపు శ్రీనివాస్(28) అనే వ్యక్తి తన స్నేహితుడు ఉదయ్భాస్కర్తో కలిసి గచ్చిబౌలి వద్ద జీఏఆర్ ఇన్ఫోబాన్ రోడ్డు మార్గంలో మోటార్సైకిల్పై వెళ్తుండగా బైక్ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి శ్రీనివాస్, భాస్కర్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, భాస్కర్ గాయాలతో బయటపడ్డాడు’’ అని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.