సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును మెదక్ జిల్లా సహకార, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ ఆహ్వానించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న ఈ ఆలయానికి అత్యాధునికమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఆలయాన్ని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.