తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,877 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,414 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 1,01,812 శాంపిల్స్ ని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసులు..
జీహెచ్ఎంసీలో 1189, మేడ్చల్ మల్కాజ్ గిరి 348, రంగారెడ్డి 241, హన్మకొండ 140, యాద్రాద్రి భువనగిరి 119, పెద్దపల్లి 110, నిజామాబాద్ 107, నల్గొండ 133, మంచిర్యాల 104, భద్రాద్రి కొత్తగూడెం 116, ఖమ్మం 112, కరీంనగర్ 92, మహబూబ్ నగర్ 95, ఆదిలాబాద్ 38, జగిత్యాల 83, జనగామ 45, జయశంకర్ భూపాలపల్లి 33, జోగులాంబ గద్వాల్ 34, కామారెడ్డి 45, కరీంనగర్ 92, కొమురం భీం ఆసిఫాబాద్ 21, మహబూబాబాద్ 50, మెదక్ 44, ములుగు 23, నాగర్ కర్నూల్ 66, నారాయణ్ పేట్ 24, నిర్మల్ 56, రాజన్న సిరిసిల్ల 47, సంగారెడ్డి 93, సిద్దిపేట 90, సూర్యాపేట 45, వికారాబాద్ 46, వనపర్తి 45, వరంగల్ రూరల్ 43.