ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటరీ సమావేశాల్లో బీజేపీ తో పోరుకి సిద్ధమైన తెరాస

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 01:20 PM

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన రేపు (ఆదివారం, జనవరి 30) మధ్యాహ్నం 1 గంటలకు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు.బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం శ్రీ కేసిఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com