టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైఠాయించారు. కృష్ణమూర్తి నేతృత్వంలో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికి పోస్టర్లు వేసి పూలవర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఉన్నారు.