నల్గొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం నరసాపురం గ్రామంలో ఈ నెల 24న సపావత్ రమాదేవి అనే మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రమాదేవి ఆత్మహత్యకు భూక్యా కృష్ణ అనే యువకుడి వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.