పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తూ తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజును ఈ నెల (జనవరి) 29 నుంచి వచ్చే నెల (ఫిబ్రవరి) 14 వరకు పొడిగించారు. ఆలస్య రుసుముతో మార్చి 14లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.