తెలంగాణలో గత 24 గంటల్లో 12వేల 870 కరోనా పరీక్షలు చేయగా అందులో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లో అత్యధికంగా 33 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక రోజు వ్యవధిలో మరో 28 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. కొత్త కరోనా మరణాలు ఏవీ నివేదించబడలేదు.రాష్ట్రంలో ఇంకా 413 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 4,111. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల 92 వేల 802 కరోనా కేసులు నమోదయ్యాయి.