పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందే రైతులందరూ ఈ - కేవైసీ ధ్రువీకరణను తప్పకుండా నమోదు చేసుకోవాలని హద్నూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సాయిలు సూచించారు. ఈ కేవైసీ చేస్తేనే రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ. 2 వేలు ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ నెల 31వ తేదీలోగా క్లస్టర్ లోని గ్రామాలకు చెందిన రైతులు ఈ- కేవైసీని ధ్రువీకరించుకోవాలన్నారు.