తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సిలబస్ మళ్లీ అమలు కానుంది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులకు తరగతులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొనడంతో సిలబస్ 30 శాతం తొలగించారు. ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరంలో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని... ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు వంద శాతం సిలబస్ అమలులో ఉంటుందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు.