అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ తాటి వెంకటేశ్వర్లు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం అయన టీఆర్ఎస్ పార్టీ ని వీడి గాంధీభవన్కు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు వచ్చే వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.