తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో యమున అనే యువతి ఇంటర్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. శుక్రవారం రాత్రి మాస్క్ వేసుకుని బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. బాధితురాలిని స్థానికులు వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మోత్కూరు ఎస్ఐ జానకిరామ్రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.