సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ సోదరుడికి తెలంగాణ సర్కారు ఉద్యోగం ప్రకటించింది. దీనిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ సోదరుడు రామరాజుకు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తగిన ఉద్యోగం ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపిని ఆదేశించారు.