ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడును జీవచ్ఛవంగా మార్చింది కాంగ్రెస్, బీజేపీ లేనని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వేయడం అంటే.. మన ఘోరీలను మనం కట్టుకోవడమేనని అన్నారు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.