హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. కాచిగూడ ఫ్లాట్ఫాం టికెట్ ధరను రూ.20కు పెంచుతున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. దసరా పండుగ సందర్భంగా ఫ్లాట్ ఫారం టికెట్ ధరలు పెంచినట్లు ద.మ. రైల్వే పేర్కొంది. పెంచిన ధరలు నేటి నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు వర్తిస్తాయని ద.మ.రైల్వే తెలిపింది.