విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రం అనేక సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. నష్టాలపై సెయిల్ లో చర్చలు జరిపామన్నారు.