తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డిలో నిజాంపేట, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, మహబూబాబాద్ లో సీరోలు, ఇనుగుర్తి, సిద్ధిపేటలో అక్బర్పేట, భూంపల్లి, కుకునూరుపల్లి, కామారెడ్డిలో డోంగ్లి , మహబూబ్నగర్ లో కౌకుంట్ల, నిజామాబాద్ లో ఆలూర్, డొంకేశ్వర్ సాలూరాను మండలాలుగా ఏర్పాటు చేశారు.