ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'క్రమబద్ధత' (Regularity) విభాగంలో 'మిషన్ భగీరథ' మొదటి స్థానంలో నిలిచింది. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులతో కూడిన మిషన్ భగీరథ బృందం, గాంధీ జయంతి 'స్వచ్ఛ భారత్ దివస్' వేడుకల సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నుండి ఈ అవార్డును అందుకున్నారు.