దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపాలను బిజెపి రాష్ట్ర నాయకురాలు, జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి దర్శించుకున్నారు. ఈనేపధ్యంలోనే ఆదిలాబాద్ లోని మహాలక్ష్మీ వాడ అమ్మవారి ఆలయంలో దుర్గామాత మండపం వద్ద, కోలిపుర కాలనీలోని అమ్మవారి మండపాలలో ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుహాసిని రెడ్డిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు క్రాంతి కుమార్ గటిక, నరేష్, రాకేష్ రెడ్డి, అనూప్, లంక శ్రీను, అక్షయ్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.