వైయస్సార్ టిపి అధినేత షర్మిల చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు ములుగు జిల్లాలో ప్రారంభమవుతుందని వైయస్సార్ టిపి ములుగు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గణపురం మండలం మీదుగా 10 గంటల 30 నిమిషాలకు జిల్లాలోని వెంకటాపురం (ఎం) మండలంలో ప్రవేశించి కేశవాపురం , నరసాపురం , సింగరగుంటపల్లి మీదుగా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ములుగు మండలం బండారు పెళ్లికి చేరుకుంటుందని తెలిపారు.