సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం స్థానిక శాసనసభ్యులు రఘునందన్ రావు సందర్శించారు. ఆస్పత్రికి సందర్శించిన అనంతరం దుబ్బాక వంద పడకల ఆసుపత్రి కమిటీ సభ్యులతో ఆసుపత్రి కమిటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి కావలసిన ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లను ఆప్యాయంగా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.