కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధి సోమవారం కోలన్ నీలా గోపాల్ రెడ్డి 25వ డివిజన్ పరిధి ఎన్టీఆర్ పార్క్ నందు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ లక్ష్మి కుమారీ తో కలిసి కంటి వెలుగు కంటి పరీక్షా శిబిరం కార్యక్రమంలో పాల్గొని, కంటి పరీక్ష శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కంటి పరీక్ష శిబిరంలో ఏమైన సదుపాయాల లోపాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకొని, ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం మరియు అవసరమైన వారికి కళ్ళ అద్దాలను, మందులను అందజేయాలని తెలియజేశారు. మరియు అన్ని రకాల సౌకర్యాలను పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి సుబ్బారావు, ఆవుల పావని జగన్ యాదవ్, రాజేశ్వరి వెంగయ్య చౌదరీ, శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్,ఎన్ఎంసి మెడికల్ ఆఫీసర్ అజీజ్,ఎన్ఎంసి అధికారులు,స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు,డాక్టర్లు మంజుల, కమల, చంద్రిక మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.