కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటిలో పలు రాజకీయ, సామజిక అంశాల గురించి చర్చించారు. బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు డా. ఎస్ మల్లా రెడ్డి, శాంతి కుమార్, కొల్లు మాధవి, జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి , పలువురు నాయకులు పాల్గొన్నారు.