మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కటేదాన్ మెయిన్ రోడ్డు, శాంతినగర్ లోని సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులను మున్సిపల్, ఎచ్ ఎమ్ డబ్ల్యు ఎస్ ల అధికారులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యవేక్షించారు. నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీఎచ్ఎంసీ ఈఈ నరేందర్ గౌడ్, ఎఈ బల్వంత్ రెడ్డి, ఎచ్ ఎం డబ్ల్యు ఎస్ డిజిఎం జమిల్, డివిజన్ ప్రెసిడెంట్ టి.ప్రేమ్ గౌడ్, రఘు యాదవ్, సరికొండ వెంకటేష్, ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, గట్టయ్య, బాస శ్రీను, సుందర్, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.