ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ కి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 04:36 PM

మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR), తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు. అనంతరం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగుస్తున్నందున భారత్ జోడో యాత్ర లక్ష్యాలు నెరవేరాలని, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాబుబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హజ్రత్ అబ్దుల్ ఖాదర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జియంఆర్, తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు.


ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్, సంజీవ్ ముదిరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత రాఘవేంద్ర రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహీర్ అక్తర్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జె. చంద్రశేఖర్, ఎన్ఎస్యూఐ(NSUI) జిల్లా అధ్యక్షుడు ఆవేజ్, వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com