మహాత్మా గాంధీ వర్ధంతి సంధర్బంగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూరు మునిసిపాలిటీ కేంద్రంలో సోమవారం నాడు జాతీయ నేతల విగ్రహాల కూడలిలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మహాత్మా గాంధీ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సాదిక్, రాష్ట్ర సేవదల్ కార్యదర్శి సంజీవ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు వెంకట్ నారాయణ, పోచయ్య , జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.