మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తాలూకాకు చెందిన మాజీ సర్పంచ్ చింతకాయల పెంటయ్య, ఎండి తౌపిక్ అహ్మద్, అహమ్మద్ హజ్రామి, సిహెచ్ అశోక్ వర్ధన్, బి వంశీ, అయోధ్య, సిహెచ్ భ్రమరాంబ, డి శ్రీనివాసులు, సి శ్రీనివాసులు ఈరోజు సోమవారం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మోపతయ్య, మహబూబ్నగర్ పార్లమెంట్ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నీ ప్రతిష్టo చేయడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం సభ నుంచే ఇంటింటికి టిడిపి కార్యక్రమము ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను బొట్టు పెట్టి టీడీపీ కరపత్రాలను అందజేస్తున్నామన్నారు. ఈ కరపత్రాలతో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో టీడిపి ఏమి చేస్తుంది వంటి అంశాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడం ఖాయమని అన్నారు.