కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం పిట్లం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు,మోసపూరిత అంశాలపై గ్రామ ప్రజలకు హెడ్ కానిస్టేబుల్ సాయి గౌడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది ఓంకార్, కాషా గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.