హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై సోమవారం మాచారెడ్డి మండలంలోని భవానిపేట్ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎయిడ్స్ నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను నాటిక కళారూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. కళాబృందం ప్రదర్శించిన నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలకిషన్, కరోబార్ నర్సింలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.