ఉప్పల్ డివిజన్లోని శాంతినగర్ దళితవాడలో ఆధునిక హంగులతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కానుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా రూ. 38 లక్షల నిధులను మంజూరు చేయించారు. మంగళవారం ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి శాంతినగర్ దళితవాడలో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు.
ఉప్పల్ హిల్స్, కురుమనగర్లోనూ రూ. 66 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులు వేగం పుంచుకున్నాయని ఈ సందర్భంగా కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి తెలిపారు. మిగతా కాలనీలు, దళితవాడల్లోనూ ఇదే తరహాలో అన్ని రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు.