అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో డిండి మండలంలోని తవక్లాపూర్ గ్రామంలోని రోడ్డు గుంతల మాయంగా తయారై వాహనదారులకు ప్రయాణికులకు ప్రమాదకరంగా ఉండడంతో రోడ్డుకు మట్టి కొట్టించి గుంతలను పుడ్చాలని జనవరి 25వ తేదీన గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వినతికి వెంటనే స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను మట్టి కొట్టించి పూడ్చిన ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఎనమల్ల నవీన్, గోద మహేష్, ఎండీ బాబర్, నూనె వెంకటయ్య, ఎండీ మైముద్, కుమార్, చెనమోని మహేష్, తదితరులు పాల్గొన్నారు.