మెదక్ జిల్లా నర్సాపూర్ మండల మైనార్టీ విభాగం అధ్యక్షునిగా ఆజ్మత్ అలీ నియమించినందుకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డిని వారి నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ మండల మైనార్టీ విభాగం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన ఆజ్మత్ అలీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలని మండల వ్యాప్తంగా పార్టీ మైనార్టీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని, మైనార్టీ విభాగ గ్రామా కమిటీల ఏర్పాటును పర్యవేక్షించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు ఆజ్మత్ అలీకి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు హకీమ్, సురేష్ నాయక్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.