చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఆదివారం అర్దరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నడిపిన వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు చిగురుమామిడి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డీజే యజమాని గరిగే సచిన్ పైన, నిర్వాహకుడు గుగ్లోత్ అజయ్ పైన కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెట్టి శబ్దకాలుష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.